సీఎం జగన్‌ పై సోదరి షర్మిల ఆసక్తికర ట్వీట్

ఏపీ సీఎం జగన్ పై సోదరి షర్మిల ట్వీట్ చేశారు. ఓ వైపు కరోనాతోనే పోరాడుతూనే జగన్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. షర్మిల ప్రస్తుతం ఆమె పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేకపోయినప్పటికీ… సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా ఏపీలో మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేసిన తన అన్నపై ఆమె మరోసారి ప్రశంసించారు. 'ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెక్కిరిస్తున్నా.. మరోవైపు కరోనా ఖర్చు భారంగా మారినా.. ప్రజలకు మంచి చేయాలనే నీ ధృడ సంకల్పానికి హాట్సాఫ్ అన్నా' అంటూ ట్విట్ చేశారు. నీ స్వచ్ఛమైన ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు ఆ దేవుడి దయ, ప్రజల దీవెనలు, పైనుంచి నాన్న ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటాయి జగనన్న’ అని ట్వీట్ చేశారు షర్మిల.