ఏపీ: మత్స్యకార భరోసాకు శ్రీకారం.. వారి అకౌంట్లలోకి రూ.10వేలు

ఏపీలో వైఎస్సార్ మత్స్యకార భరోసాకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించారు.. వివిధ జిల్లాల నుంచి కలెక్టర్లు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. సీఎం మత్స్యకారులతో మాట్లాడారు. ఈ పథకం కింద మత్స్యకారుల ఖాతాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ. 10 వేలు జమ చేయనుంది. మొత్తం లక్షా 9 వేల 231 మంది లభ్దిదారులకు ప్రయోజనం చేకూరుతుంది.